Sunday, April 5, 2015

క్రీ . శ 3050 నాటి మానవ జాతి కథ !

క్రీ . శ  3050 నాటి  మానవ జాతి  కథ !
----------------------------------------------------------------------------------------
ఇది  క్రీ శ.  3050 : గ్రహం :  భూమి ; కాల మానం : సరిగ్గా తెలియడం లేదు.
చంద్రుడు  వెన్నెలను కురిపించ  పోయి  ఒక్క సారిగా  ఉష్ణ  విస్పోటనాలను  వెద  జల్లాడు .
సూర్యుడు  మండే వెలుగుకు    బదులుగా మలయ మారుత శీతల  కిరణాలను  వెదజల్లాడు .
ఏమిటీ  వైపరీత్యం ?
భూమి  తన  చుట్టు  తాను  తిరుగుతూ   సూర్యుడి  చుట్టూ  తిరుగుతుందన్నారు  శాస్త్రజ్ఞులు .
భూమి  తన  చుట్టూ  తాను  తిరగడం  మానేసి   చంద్రుని  చుట్టూ  తిరుగుతోంది .
ఆకాశంలో  ఎక్కడ చూసినా  తోకచుక్కలే !
నక్షత్రాలకు  బదులు  మండే   నల్లని  తోకచుక్కలు  దర్శన  మిస్తున్నాయి .
రాత్రి  పగలయింది . పగలు  రాత్రయింది .
విశ్వమంతా  కంపించి పోయింది .
ప్రకృతి  అంతా  నిస్తేజ మయింది .
సరస్సుల్లోంచి  లావాలు  ఉబుకుతున్నాయి .
సముద్రంలోంచి  అగ్ని  పర్వతాలు  ప్రజ్వరిల్లు  తున్నాయి .
ఆకాశం  నుండి  బడ  బాగ్నులు  రాలుతున్నాయి .
పచ్చని  పొలాలు  బూడిద  కుప్పలుగా  మారిపోయ్యాయి .
నదులన్నీ  నిష్క్రమించాయి  ప్రవహించే  నీళ్ళు  లేక .
ఈగల్లగా , దోమల్లాగా  మనుషు లందరూ  మల మల మాడి చస్తున్నారు .
బ్రతికి  ఉంటే  బలుసాకు  అయినా  తిని  బ్రతక  వచ్చని  బ్రతికి  ఉన్న మనుషులందరూ  కొండల్లో , గుహల్లో  దాగు కొన్నారు .
ఏ దేవుడైనా  వచ్చి ఈ మానవాళిని  రక్షిస్తాడా ?
ఏ  భగవంతుడైనా  ఇంకో  అవతారం  ఎత్తి  మనుషుల్ని  రక్షిస్తాడా ?
ఈ  వైపరీత్యం  వెనుక  మతలబు ఏమి టో  అర్థం  గాలేదు  బతికున్న  మనుషులకి ..
గ్రీన్ హౌస్  లు ఆకాశంలో  ప్రత్యక్ష మయ్యాయి
స్పేస్  టెక్నాలజీ  తో  మనిషి  స్పేస్ విల్లా ల్లో  బతకడం  నేర్చుకొన్నాడు
కొంతమంది  అదృ ష్టవంతులు మార్స్  గ్రహంలో  నివాసాలు  ఏర్పరచుకొన్నారు .
క్రీ శ  2100  సంవత్సరంలో  మార్స్  కి వెళ్ళిన కొద్దిమంది  ప్రాచీనుల  సంతతి  ప్రాణాలను  రక్షించు కోగలిగారు .
భూ వైపరీ త్యానికి కారణాలు  వెతుకుతున్నారు  శాస్త్రజ్ఞులు అటు  మార్స్  లోనూ , ఇటు  స్పేస్  లోనూ
ఇంటర్నెట్  సెర్చ్  ఇంజన్లు  నిర్విరామంగా  పనిచేస్తున్నాయి
అలీన్  గ్రహాలలో  ఉన్న  వాళ్ళు  యుద్దమేమైన ప్రకటించారా  అని  పరిశోధిస్తున్నారు .
భవిష్యత్తు  పురాణం , నోస్ట్రాడమస్ , జడ్జిమెంట్  డే , విర  బ్రహ్మేంద్ర  స్వామీ కాల జ్ఞానం  , అన్ని  మత గ్రంధాలు  తిరిగేస్తున్నారు .
భూమ్మీద  జరుగుతున్న ఈ  ప్రళయాన్ని  అడ్డుకో వడానికి  సట  లైట్లను , అల్ట్రా  మోడరన్  లేసర్  రేస్  ని  పంపిస్తున్నారు  భూమ్మీదకు  మార్స్  శా స్త్ర వేత్తలు
ఒక్క  మార్సియన్  కి ఒక్క తెలుగు పత్రిక లో క్రీశ 2000  లో ప్రచురించిన  ఒక కథ  దొరికింది .
తనకి క్లూ  దొరికి  నట్లయింది .
మనిషి  విజ్ఞానం  సంపాయించాడు  గానీ , జ్ఞానం  సంపాయించలేదు .
మనిషి ఆస్తులు  కూడ బెట్టాడు  గాని  ఆత్మ స్థైర్యం  సంపాయించ లేదు .
మనిషి  జలాంత ర్గాముల్లో , అకాసాల్లో  తిరిగాడు  గానీ  ఆత్మ ఉనికిని  కని బెట్టలేదు .
మనిషి  ఉపగ్రహాలు సృ ష్టి ంచి  ,ఇతర  గ్రహాల్లో నివాసాలు  ఏర్పరచుకొన్నాడు  గాని  భూమ్మీద  తన  ఉనికిని  మరచి పొయ్యాడు .
బయో  డైవెర్సిటీ , జంతు వృక్ష  భావ  సారూప్యాన్ని  , సమన్వయాన్ని  మరచి  పొయ్యాడు .
ప్రకృతి  విరుద్ధమైన  పనులు  చేశాడు .
చెరువుల్ని  ఎండగట్టాడు , నదుల్ని  నిర్వీర్యం  చేశాడు .
అడవుల్ని  కాల్చేశాడు , చెట్లని  తెగ  నరికాడు .
ఫాక్టరీల  కాలుష్యాన్ని  జన  వాసాల్లోకి  వదిలాడు .
యురెనియమ్ గనుల్ని  తవ్వాడు , మానవ జాతికి  మరణ శాసనాన్ని  రాశాడు .
ఇనుప ఖనజాల్ని తవ్వాడు , తెగ నమ్ము కొన్నాడు .
సముద్రాలకి  రంధ్రాలు వేసి  వాయు నిక్షేపాల్ని ఎగ జిమ్మాడు .
భూమాత గుండెకు  చిల్లు పెట్టి నీళ్ళను  పై కి లాగాడు .
పాతాళా నికి  టనేల్స్  కట్టి   సముద్ర విహారం  చేశాడు .
జంతువుల  DNA  లు సేకరించి  , బతికున్న జంతువుల్ని  ప్రయోగ శాలలో  చంపేశాడు .
మనుషుల మిద రసాయన  ప్రయోగాలు చేశాడు
సృష్టికి  ప్రతి  సృష్టి  చెయ్య  బోయి , రోబోల్ని  సృష్టించాడు .
మేధస్సును  నిర్వీర్యం  చేసే  కంప్యుటర్లకు బానిసయిపోయ్యాడు .
మతం పేరుతొ  మనుషుల ప్రాణాలు తీశాడు
టెస్ట్  ట్యూబ్ లో బేబీ  లాంటి ప్రకృతి  విరుద్ధ  పనులు  చేశాడు .
కొండల్ని , గుట్టల్ని పగల గొట్టి  అంతస్తులు  కట్టాడు .
భావి తరాలకు  ఏమో  చెయ్యాలని   వాళ్లకి బ్రతుకు  లేకుండా చేశాడు .
వాయు  కాలుష్యం - జల కాలుష్యం - శబ్ద కాలుష్యం  - వరదలు - సునామీలు- భూకంపాలు
ప్రకృతి మాతను  దుర్వినియోగం   చేసి   కాల కూట విషాన్ని నింపాడు .
అష్టా  వక్రులగా  పుట్టిన పిల్లలు చేతనా రహితులయ్యారు
భూగ్రహం లో ఆక్సిజన్  బదులు విష  వాయువులు  నిండి  పొయ్యాయి
తిండి లేక  డైట్  కాప్సుల్  తో బ్రతుకుతున్న జనం , ఆక్సిజెన్  సిలిండెర్స్  తగిలించుకొన్నారు .
భూ ఉపరితలం  విష  వాయువులతో  పనికి రాకుండా పోయింది .
అందుకే  మనుషులు satellite township  లలో ఆకాసంలో  గుంపులు గుంపులు గా బతుకు తున్నారు .
కొందరు వేరే గ్రహాల్లో  బతుకు తున్నారు . దిక్కు లేని వాళ్ళు కొండ గుహలలో  కాలం వెళ్ళ బుచ్చు  తున్నారు .
పాపం  ... మానవ  జాతి ... మరణ శాసనం  తానే  రాసుకొన్నది !!


----------------------------------------------

భాను వారణాసి /  05. 04. 2015
 

No comments:

Post a Comment