Thursday, April 23, 2015

మూగ జీవాలు

మూగ  జీవాలు
----------------------------------

కట్టెలు  ఇరిసినట్లు
మక్కెలు  ఇరగ్గోడుతున్రు
గడ్డి మోపు  కట్టినట్లు
మా కాళ్ళు సేతులు  కట్టి పడేస్తున్రు

నోరు లేదనే  కదా
మా జీవాల్ని  ఆగమాగం  సేస్తున్రు
ఆటోల్లో  సూడండ్రి సూడండ్రి
ట్రాలీల్లొ  సూడండ్రి సూడండ్రి
లారిలల్లో  సూడండ్రి సూడండ్రి
బండ్లల్లో  సూడండ్రి  సూడండ్రి
పాన  మున్నదన్న  లెక్క  మరిసిపోయి
మమ్మల్ని  సెత్త  లెక్క   తీసుకు పోతున్రు

గొర్రెలు  పోట్టీళ్ళు  మేకలు
ఆవులు దున్నపోతులు  బర్రెలు
కోళ్ళు సేపలు 
తినుడు  ఏదయినా  సరే
మా బొక్కెలు  ఇరగ్గొట్టి
సిలువలు  ఏసీ
తాళ్ళతో  కట్టి
మేకులు  దిగ్గొట్టి
కాళ్ళ రక్తం  కారుతున్నా
చర్మం   సీక్కు  పోయినా
కను పాపలు   జారిపోయినా
మీకు  లెక్క లేదు
మా జాతి బాధ  మీకు  సమజయిత  లేదు
మాకు  మాటలు  రావనే గదా
మమ్మల్ని  గిట్ల  సేస్తున్రు
మా తలకాయలల్తో
కాళ్ళతో  సేతులతో
బిరియానిలు  సెసుకోన్రి
అమ్మోరికి  మా తల కాయలు  నరికి
బలి ఇయ్యండ్రి
మేం  పుట్టిందే  అందుకు
మిమ్మల్ని  కుషి గా  పెట్టే  విందుకు
గానీ  మనుషుల్లారా !
మమ్మల్ని  కసాయి వాడికి  ఈడ్చే ముందు
జర్ర కనికరం సూపండ్రి
మమ్మల్ని కాళ్ళు సేతులు  కట్టేసి
గొనె సంచుల్లొ  కుక్కేసి
తిండి  నీళ్ళూ  పెట్టక
మమ్మ ల్ని  మార్కెట్లకి  తరలించొద్దండ్రి
మా అంతిమ పయనం సుఖంగా  జరిగేటట్లు  సూడండ్రి
అన్నల్లారా ! అయ్యల్లారా !అమ్మల్లారా !
అక్కల్లారా ! సేల్లెల్లారా !
మీకిదే  మా  సలాం
మీకిదే  మా  నమస్కారం
మీకిదే  మా  విన్నపం
మమ్మల్ని సచ్చే  ముందయినా  జంతువుల్లా  సూడండ్రి !
సచ్చే  ముందు  మమ్మల్ని  సంతోషంగా  అయినా  సావనివ్వండ్రి !!

 వారణాసి భానుమూర్తి రావు 

Saturday, April 18, 2015

నిర్యాణం

 నిర్యాణం
----------------------------------------------------------------------------

మండే  ఎండలో  మనిషి పక్కన   ఖాళీ  గిన్నెలు  పైసల  కోసం అడుక్కొంటున్నాయి
పంజగుట్ట  రోడ్డు  దివైడేర్ కాస్తా  జాలిగా  తన మీద నిద్ర పొమ్మంది  ఆ  మనిషిని
ఆ మనిషి  గుబురు గడ్డంలో    సహవాసం చేస్తూ
ఉన్న రక్తాన్ని  గూడా పీలుస్తున్నందుకు  దోమలు
కృతజ్ఞతగా  రెక్కల సంగీతాన్ని  వినిపిస్తున్నాయి
ముసురు కొంటున్న ఈగలు మడత ముఖంలో  జాగా వెతుక్కొంటున్నాయి ... ఈ  రాత్రికి
అక్కడే   గడిపెయ్యాలని ...
కాగితాలు , చెత్త చెదారం ఏరుకొని  బతికే వాడికి
అంతకంటే  సహారా  ఏమి  దొరుకుతుందని  మున్సిపల్ వాళ్ళు గుడా
చూసి  చూడనట్లు   తమ పనిలో  నిమగ్న మైనారు
సెల్లు  ఫోనులో  సొల్లు  కబుర్లు  చెప్పుకొంటూ  నడిచే  పాదచారులు
ఒక్క లుక్కేసి  ,  చిల్లరలేని  పర్సును  ' అయ్యో  పాపం ' అంటూ  జోబిల్లో  కుక్కు కొంటూ
'ఈ  దేశం  బాగుపడదు ' అని  ఒక  డైలాగ్  వదులుకొంటూ  పారిపోతున్నారు
తిండి  లేని  దేహం అస్థి పంజరం  మధ్య  చిక్కుకొని  ప్రతిరోజూ ఆత్మతో
కొట్లాడుతూనే  ఉంది '  నన్నెపుడు  వదలి వేళ తావని?'
లేచి  నిలబడే శక్తి  లేక , మల మూత్రాదులు  గూడా అక్కడే  విసర్జించి
ఆ  రోచ్చులోనే  బ్రతుకు పోరాటాన్ని  చేసే ఆ  అభాగ్యుణ్ణి  చూసి
అక్కడున్న  ఫ్లైఓవర్ , ట్రాఫిక్  సిగ్నళ్ళు , కరెంట్  స్థంబాలు , ఇనుప  సామాన్లు , సిమెంట్ దిమ్మెలు
ఇనుప పంజరాల్లో  బందీలయిన  ఎండిన మొక్కలు నివ్వెరపోతున్నాయి ...

జీవ  మున్న శవాన్ని  చూసి
నిర్జీవ  మైన  పదార్థాలన్నీ  ఇలా  అనుకోన్నాయి ....
'అసలు  వీళ్ళు  మనుషులేనా  అని.....  ?'

అక్కడున్న కాకులు , గద్దలు , పిల్లులు ,కుక్కలు
ఇలా  అనుకోన్నాయి ...

'ఏ  శాస్త్రజ్ఞుడైనా  దయ  తలచి ఒక  మందు గానీ  గోలి గానీ    కనిబెడితే బాగుణ్ణేమో.....
దయ , కరుణ  ఈ  రాతి  గుండె  మనుషులకు  కలగ డానికి  !!'

ఆ మనిషి  నిర్యాణం  కోసం  నిర్మాణం  జరుగుతోంది !!


 వారణాసి భాను మూర్తి రావు
18. 04. 2015

 

Sunday, April 5, 2015

క్రీ . శ 3050 నాటి మానవ జాతి కథ !

క్రీ . శ  3050 నాటి  మానవ జాతి  కథ !
----------------------------------------------------------------------------------------
ఇది  క్రీ శ.  3050 : గ్రహం :  భూమి ; కాల మానం : సరిగ్గా తెలియడం లేదు.
చంద్రుడు  వెన్నెలను కురిపించ  పోయి  ఒక్క సారిగా  ఉష్ణ  విస్పోటనాలను  వెద  జల్లాడు .
సూర్యుడు  మండే వెలుగుకు    బదులుగా మలయ మారుత శీతల  కిరణాలను  వెదజల్లాడు .
ఏమిటీ  వైపరీత్యం ?
భూమి  తన  చుట్టు  తాను  తిరుగుతూ   సూర్యుడి  చుట్టూ  తిరుగుతుందన్నారు  శాస్త్రజ్ఞులు .
భూమి  తన  చుట్టూ  తాను  తిరగడం  మానేసి   చంద్రుని  చుట్టూ  తిరుగుతోంది .
ఆకాశంలో  ఎక్కడ చూసినా  తోకచుక్కలే !
నక్షత్రాలకు  బదులు  మండే   నల్లని  తోకచుక్కలు  దర్శన  మిస్తున్నాయి .
రాత్రి  పగలయింది . పగలు  రాత్రయింది .
విశ్వమంతా  కంపించి పోయింది .
ప్రకృతి  అంతా  నిస్తేజ మయింది .
సరస్సుల్లోంచి  లావాలు  ఉబుకుతున్నాయి .
సముద్రంలోంచి  అగ్ని  పర్వతాలు  ప్రజ్వరిల్లు  తున్నాయి .
ఆకాశం  నుండి  బడ  బాగ్నులు  రాలుతున్నాయి .
పచ్చని  పొలాలు  బూడిద  కుప్పలుగా  మారిపోయ్యాయి .
నదులన్నీ  నిష్క్రమించాయి  ప్రవహించే  నీళ్ళు  లేక .
ఈగల్లగా , దోమల్లాగా  మనుషు లందరూ  మల మల మాడి చస్తున్నారు .
బ్రతికి  ఉంటే  బలుసాకు  అయినా  తిని  బ్రతక  వచ్చని  బ్రతికి  ఉన్న మనుషులందరూ  కొండల్లో , గుహల్లో  దాగు కొన్నారు .
ఏ దేవుడైనా  వచ్చి ఈ మానవాళిని  రక్షిస్తాడా ?
ఏ  భగవంతుడైనా  ఇంకో  అవతారం  ఎత్తి  మనుషుల్ని  రక్షిస్తాడా ?
ఈ  వైపరీత్యం  వెనుక  మతలబు ఏమి టో  అర్థం  గాలేదు  బతికున్న  మనుషులకి ..
గ్రీన్ హౌస్  లు ఆకాశంలో  ప్రత్యక్ష మయ్యాయి
స్పేస్  టెక్నాలజీ  తో  మనిషి  స్పేస్ విల్లా ల్లో  బతకడం  నేర్చుకొన్నాడు
కొంతమంది  అదృ ష్టవంతులు మార్స్  గ్రహంలో  నివాసాలు  ఏర్పరచుకొన్నారు .
క్రీ శ  2100  సంవత్సరంలో  మార్స్  కి వెళ్ళిన కొద్దిమంది  ప్రాచీనుల  సంతతి  ప్రాణాలను  రక్షించు కోగలిగారు .
భూ వైపరీ త్యానికి కారణాలు  వెతుకుతున్నారు  శాస్త్రజ్ఞులు అటు  మార్స్  లోనూ , ఇటు  స్పేస్  లోనూ
ఇంటర్నెట్  సెర్చ్  ఇంజన్లు  నిర్విరామంగా  పనిచేస్తున్నాయి
అలీన్  గ్రహాలలో  ఉన్న  వాళ్ళు  యుద్దమేమైన ప్రకటించారా  అని  పరిశోధిస్తున్నారు .
భవిష్యత్తు  పురాణం , నోస్ట్రాడమస్ , జడ్జిమెంట్  డే , విర  బ్రహ్మేంద్ర  స్వామీ కాల జ్ఞానం  , అన్ని  మత గ్రంధాలు  తిరిగేస్తున్నారు .
భూమ్మీద  జరుగుతున్న ఈ  ప్రళయాన్ని  అడ్డుకో వడానికి  సట  లైట్లను , అల్ట్రా  మోడరన్  లేసర్  రేస్  ని  పంపిస్తున్నారు  భూమ్మీదకు  మార్స్  శా స్త్ర వేత్తలు
ఒక్క  మార్సియన్  కి ఒక్క తెలుగు పత్రిక లో క్రీశ 2000  లో ప్రచురించిన  ఒక కథ  దొరికింది .
తనకి క్లూ  దొరికి  నట్లయింది .
మనిషి  విజ్ఞానం  సంపాయించాడు  గానీ , జ్ఞానం  సంపాయించలేదు .
మనిషి ఆస్తులు  కూడ బెట్టాడు  గాని  ఆత్మ స్థైర్యం  సంపాయించ లేదు .
మనిషి  జలాంత ర్గాముల్లో , అకాసాల్లో  తిరిగాడు  గానీ  ఆత్మ ఉనికిని  కని బెట్టలేదు .
మనిషి  ఉపగ్రహాలు సృ ష్టి ంచి  ,ఇతర  గ్రహాల్లో నివాసాలు  ఏర్పరచుకొన్నాడు  గాని  భూమ్మీద  తన  ఉనికిని  మరచి పొయ్యాడు .
బయో  డైవెర్సిటీ , జంతు వృక్ష  భావ  సారూప్యాన్ని  , సమన్వయాన్ని  మరచి  పొయ్యాడు .
ప్రకృతి  విరుద్ధమైన  పనులు  చేశాడు .
చెరువుల్ని  ఎండగట్టాడు , నదుల్ని  నిర్వీర్యం  చేశాడు .
అడవుల్ని  కాల్చేశాడు , చెట్లని  తెగ  నరికాడు .
ఫాక్టరీల  కాలుష్యాన్ని  జన  వాసాల్లోకి  వదిలాడు .
యురెనియమ్ గనుల్ని  తవ్వాడు , మానవ జాతికి  మరణ శాసనాన్ని  రాశాడు .
ఇనుప ఖనజాల్ని తవ్వాడు , తెగ నమ్ము కొన్నాడు .
సముద్రాలకి  రంధ్రాలు వేసి  వాయు నిక్షేపాల్ని ఎగ జిమ్మాడు .
భూమాత గుండెకు  చిల్లు పెట్టి నీళ్ళను  పై కి లాగాడు .
పాతాళా నికి  టనేల్స్  కట్టి   సముద్ర విహారం  చేశాడు .
జంతువుల  DNA  లు సేకరించి  , బతికున్న జంతువుల్ని  ప్రయోగ శాలలో  చంపేశాడు .
మనుషుల మిద రసాయన  ప్రయోగాలు చేశాడు
సృష్టికి  ప్రతి  సృష్టి  చెయ్య  బోయి , రోబోల్ని  సృష్టించాడు .
మేధస్సును  నిర్వీర్యం  చేసే  కంప్యుటర్లకు బానిసయిపోయ్యాడు .
మతం పేరుతొ  మనుషుల ప్రాణాలు తీశాడు
టెస్ట్  ట్యూబ్ లో బేబీ  లాంటి ప్రకృతి  విరుద్ధ  పనులు  చేశాడు .
కొండల్ని , గుట్టల్ని పగల గొట్టి  అంతస్తులు  కట్టాడు .
భావి తరాలకు  ఏమో  చెయ్యాలని   వాళ్లకి బ్రతుకు  లేకుండా చేశాడు .
వాయు  కాలుష్యం - జల కాలుష్యం - శబ్ద కాలుష్యం  - వరదలు - సునామీలు- భూకంపాలు
ప్రకృతి మాతను  దుర్వినియోగం   చేసి   కాల కూట విషాన్ని నింపాడు .
అష్టా  వక్రులగా  పుట్టిన పిల్లలు చేతనా రహితులయ్యారు
భూగ్రహం లో ఆక్సిజన్  బదులు విష  వాయువులు  నిండి  పొయ్యాయి
తిండి లేక  డైట్  కాప్సుల్  తో బ్రతుకుతున్న జనం , ఆక్సిజెన్  సిలిండెర్స్  తగిలించుకొన్నారు .
భూ ఉపరితలం  విష  వాయువులతో  పనికి రాకుండా పోయింది .
అందుకే  మనుషులు satellite township  లలో ఆకాసంలో  గుంపులు గుంపులు గా బతుకు తున్నారు .
కొందరు వేరే గ్రహాల్లో  బతుకు తున్నారు . దిక్కు లేని వాళ్ళు కొండ గుహలలో  కాలం వెళ్ళ బుచ్చు  తున్నారు .
పాపం  ... మానవ  జాతి ... మరణ శాసనం  తానే  రాసుకొన్నది !!


----------------------------------------------

భాను వారణాసి /  05. 04. 2015
 

Thursday, April 2, 2015

అతడే అతడే అతడే నాయకుడు !

అతడే    అతడే  అతడే     నాయకుడు !
-------------------------------------------

తన ప్రాప్యం మరచిపోడు
తన లక్ష్యం  మార్చు కోడు
తన  దృక్పథం   మళ్లిం చు కోడు
తన ప్రణాళిక  చింపేసు  కోడు
తన సాధన  విరమించు కోడు
తన దీక్ష  విడచి పెట్టు కోడు
తన ఏకాగ్రత  చెరచు కోడు

తన  విశ్వాసం  సడలించు కోడు
తన తపన  తగ్గించు కోడు
తన ప్రయత్నం  మానుకోడు
తన ధైర్యం  విలోలంబు  కానీడు

తన  సాహసం  వృధా  కానీడు
తన  ఆశను  అస్తమించ  నీడు
తన సహనం  తరగ  నియ్యడు
తన అనుభవం  జార  నియ్యడు
తన జ్ఞాపకం  మసక బార  నియ్యడు

తన  జిజ్ఞాస  హీనింప జేయ్యడు
తన పోరాటం  ఆగ నియ్యడు
తన ప్రకృతి  వికృతి  గానీడు
అతడే    అతడే  అతడే     నాయకుడు !


(మొదటి ఏడు  వాక్యాలు  శ్రీ పాద సుబ్రహ్మణ్యం గారి ' నా అనుభవాలు.... ' పుస్తకం నుండి  తీసుకొన్నవి )