Tuesday, November 5, 2019

అల్లుకొన్న పందిరి


*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *05- 11-2019*
కవి పేరు : *వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య : *165*
అంశం * అనురాగ గోపురం*
శీర్షిక: *అల్లుకొన్న పందిరి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ఆలుమగలు కట్టుకొన్న అనురాగ గోపురం
నిలబడుతుంది కల కాలం ఆ కాపురం
చిలిపి ప్రేమలు చిగుర్లు తొడిగిన చిద్విలాసం
చిలకా గోరింకల ప్రణయ సౌందర్యం

తొలి రాత్రి శృంగార భావనలు
ప్రతి రాత్రి మధురానుభూతులు
జీవితమే ప్రణయ కావ్యమయితే
 ప్రతి రోజూ మధుర సుధా భరితము

దిన దిన ప్రవర్థ మానమైన ప్రేమని
అనురాగపు లోగిళ్ళలో  పెంచాలి
మల్లె పూవు తీగ లాగా శ్రీమతి
శ్రీవారి గుండెల్లో అల్లుకొని పోవాలి

అపార్థాల చీడ పురుగుల్ని తరిమి
దిగులు తెగుళ్ళని  దరి చేయ నీక
మధుర మైన తోటలో  ప్రేమ దేవతలై
జీవితాన్ని రసాస్వాదన చెయ్యాలి.


Sunday, November 3, 2019

కరి‌ వేపాకు

నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *14-10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*
సంఖ్య: *153*
అంశం *కరివేపాకు*
శీర్షిక: *కరివేపాకు*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
వేపాకులా కరివేపాకు
ఔషధ దాయిని
సర్వ రోగ నివారిణి
సర్వ శక్తి ప్రదాయిని

ప్రతి కూరలో
కరివేపాకు
ప్రతి ఉపాహారంలో
కరి వేపాకు

ప్రతి ఇంటి పెరట్లో
కరి వేపాకు  చెట్టు
అదే వారి ఆరోగ్యానికి
 తొలి మెట్టు

కొంతమంది మనుష్యులు
 ప్రేమాభిషేకాలు చేస్తారు
అవసరం తీరగానే
కరివేపాకులా ప్రక్కన బెడతారు


అధికారులు స్టాఫ్ ని  పనుల కోసం
 నాయకులు ప్రజల్ని  వోట్ల కోసం
పిల్లలు తల్లితండ్రుల్ని ఆస్థి కోసం
వాడుకొంటారు  కరివేపాకులా
అవసరం తీరగానే విసిరి వేస్తారు





ఆచమనం విశిష్టత

★ఆచమనం విశిష్టత★

 మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.

మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి.

 అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది.

అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది.

 నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.

ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. ‘కే’  శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.

మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది, మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది.

ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.

ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు💐

లోకాసమస్తా సుఖినోభవంతు.

నాగుల చవితి

*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది : *31- 10-2019*
*వారణాసి భానుమూర్తి రావు*

అంశం * నాగుల చవితి*
శీర్షిక: *నాగుల చవితి*

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


పాములకు‌ మొక్కే సంస్కృతి మనది
నాగ జాతిని‌ గౌరవించే ఆచారం
నాగుల చవితిని‌ పండగ గా చేసుకొని
అమ్మ లక్కలు‌ దీవెనలు పొందేరు

పాలు‌ పుట్టలో‌ పోసి
నాగన్నా  పైకి‌ రావన్నా  అంటూ
నాగులకు పాలాభిషేకం చేస్తారు
నాగుల చవితి‌ రోజు

శివుడి‌ మెడలో హారమైన
నాగ రాజుకి నీరాజనాలు
విష్ణు మూర్తికి  శయనింపు తల్పమైన
ఆది శేషుడికి  అభినందనాలు

ప్రకృతి‌ని‌ ప్రేమించెడి ఆచారము
దేవుళ్ళకు‌ వాహనాలయిన
జంతు పక్షుల కొలుచుట
హిందూ పండగల వైశిష్ట్యము
ప్రకృతిని ఆరాధించెడి
పండగలు‌ మన స్వంతం.