Saturday, April 25, 2020

సంస్కృత భాషలో వినే వాక్యాల పూర్తి శ్లోకాలు


*#సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#*
మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!
అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:
ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:
👉 *ధర్మో రక్షతి రక్షిత:*
👉 *సత్య మేవ జయతే*
👉 *అహింసా పరమో2ధర్మ:*
👉 *ధనం మూలమిదం జగత్*
👉 *జననీ జన్మ భూమిశ్చ*
👉 *స్వర్గాదపి గరీయసి*
👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*
👉 *బ్రాహ్మణానా మనేకత్వం*
👉 *యథా రాజా తథా ప్రజా*
👉 *పుస్తకం వనితా విత్తం*
👉 *పర హస్తం గతం గత:*
👉 *శత శ్లోకేన పండిత:*
👉 *శతం విహాయ భోక్తవ్యం*
👉 *అతి సర్వత్ర వర్జయేత్*
👉 *బుద్ధి: కర్మానుసారిణీ*
👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*
👉 *భార్యా రూప వతీ శత్రు:*
👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*
👉 *వృద్ధ నారీ పతి వ్రతా*
👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*
👉 *ఆలస్యం అమృతం విషమ్*
👉 *దండం దశ గుణం భవేత్*
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*
*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*
ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్
🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !
🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్
🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.
🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన
🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ
🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.
🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.
🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !
🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.
🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.
🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్
🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !
🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !
🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.
🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:
🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)
🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:
🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.
🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.
🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్
🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.
🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)
🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.
🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.
🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !
🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:
🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా  అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.
🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:
🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.
🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !
🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.
🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.
🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్
🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.
🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్
🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.
🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.
🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥
*ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.*
*పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు*


Thursday, April 23, 2020

కరోనా అంతు చూద్దాం!




శీర్షిక:  కరోనా అంతు చూద్దాం!

******************************
కాలి పగుళ్ళపై  మొలచిన  పాదయాత్రలు
అవని గడ్డ పై  ఆరని జీవన పోరాటాలు
బ్రతుకు సిలువ పై గాయపడ్డ దీన జీవులు
కరోనా దెబ్బకు  రెక్కలు తెగిన  పక్షులు
దశ , దిశ లేని పయనంలో
ఎక్కడి కని పాద యాత్ర?
చంకన బిడ్డల్ని - నెత్తిన మూటల్ని
పెట్టుకొని ఎక్కడికని నీ జీవన యాత్ర?
కరుణ లేని కరోనా కాటుకు
విలవిల లాడిన శ్రామికుల అవస్థలు
ఎక్కడ నగరానికి విష గాలి సోకిందో
అక్కడ మానవ సమూహానికి సంకెళ్ళు
భూమి తల్లిని‌ నమ్ముకొనలేక
పల్లె నీడని బ్రతుకలేక
అనివార్య మైనది నీ వలస యాత్ర
కానీ ఇప్పుడు కరోనా కాలనాగు కాటేస్తుంటే
మళ్ళీ గమ్యం తెలియని బ్రతుకు వెతుకులాట
ఇప్పుడు నగరాలన్నీ మళ్ళీ అడవులై‌ పొయ్యాయి
క్వారంటైన్ లో గృహాలన్నీ  బందీ ఖానా లయ్యాయి
కరోనా కాంపౌండు లెక్కలతో మరణాలు‌ పెరిగి పోతున్నాయి
దిక్కు తోచని శ్రామికుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి
వలస కార్మీకుల జీవితాలు బీడు భూములయ్యాయి
మళ్ళీ‌ తిరిగొచ్చినా రేపటి బతుక్కి భరోసా లేదు
ఆపన్న హస్తం చేయి అందించినా కరోనాభయం వదలటం లేదు
కొన్ని రోజులు మాత్రం  కరోనా భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది
అయినా  ధైర్యంగా ముందుకు అడుగు లేద్దాం
కరోనా అంతు చూద్దాం! అంతం చూద్దాం!!










Wednesday, April 22, 2020

మన దేశాన్ని ఎవరెవరు పరిపాలించారు?

సమాచారం గొప్ప అభినందన ...
సేకరించిన మిత్రుడి కృషికి అభినందనలు

 * I N D I A N R U L E R S.

 * బానిస రాజవంశం *
 1 = 1193 ముహమ్మద్ ఘోరి
 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్
 3 = 1210 అరామ్ షా
 4 = 1211 ఇల్టుట్మిష్
 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా
 6 = 1236 రజియా సుల్తాన్
 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా
 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా
 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్
 10 = 1266 గియాసుడిన్ బల్బన్
 11 = 1286 కై ఖుష్రో
 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్
 13 = 1290 షాముద్దీన్ కామర్స్
 1290 బానిస రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సంవత్సరాలు)

 * ఖిల్జీ రాజవంశం *
 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
 2 = 1296
 అల్లాదీన్ ఖిల్జీ
 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా
 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా
 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా
 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది
 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సంవత్సరాలు.)

 * తుగ్లక్ రాజవంశం *
 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.
 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ
 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్
 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ
 5 = 1389 అబూబకర్ షా
 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ
 7 = 1394 సికందర్ షా మొదటి
 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా
 9 = 1395 నస్రత్ షా
 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు
 11 = 1413 డోలత్ షా
 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సంవత్సరాలు)

 * సయ్యిద్ రాజవంశం *
 1 = 1414 ఖిజ్ర్ ఖాన్
 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ
 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ
 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా
 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సంవత్సరాలు.)

 * అలోడి రాజవంశం *
 1 = 1451 బహ్లోల్ లోడి
 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది
 3 = 1517 ఇబ్రహీం లోడి
 1526 లోడి రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సంవత్సరాలు.)

 * మొఘల్ రాజవంశం *
 1 = 1526 జహ్రుదిన్ బాబర్
 2 = 1530 హుమయూన్
 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

 * సూరి రాజవంశం *
 1 = 1539 షేర్ షా సూరి
 2 = 1545 ఇస్లాం షా సూరి
 3 = 1552 మహమూద్ షా సూరి
 4 = 1553 ఇబ్రహీం సూరి
 5 = 1554 ఫిరుజ్ షా సూరి
 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి
 7 = 1555 అలెగ్జాండర్ సూరి
 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

 * మొఘల్ రాజవంశం పున ar ప్రారంభించబడింది *
 1 = 1555 హుమాయు మళ్ళీ గడ్డిపై
 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్
 3 = 1605 జహంగీర్ సలీం
 4 = 1628 షాజహాన్
 5 = 1659 u రంగజేబు
 6 = 1707 షా ఆలం మొదట
 7 = 1712 జహదర్ షా
 8 = 1713 ఫరూఖ్సియార్
 9 = 1719 రైఫుడు రజత్
 10 = 1719 రైఫుడ్ దౌలా
 11 = 1719 నెకుషియార్
 12 = 1719 మహమూద్ షా
 13 = 1748 అహ్మద్ షా
 14 = 1754 అలమ్‌గీర్
 15 = 1759 షా ఆలం
 16 = 1806 అక్బర్ షా
 17 = 1837 బహదూర్ షా జాఫర్
 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

 * బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్) *
 1 = 1858 లార్డ్ క్యానింగ్
 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్
 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్
 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో
 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్
 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్
 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్
 8 = 1884 లార్డ్ డఫెరిన్
 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్
 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్
 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్
 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో
 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్
 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్
 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్
 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్
 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్
 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో
 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్
 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

 బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.

 * ఆజాద్ ఇండియా, ప్రధాని *
 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ
 2 = 1964 గుల్జారిలాల్ నందా
 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి
 4 = 1966 గుల్జారిలాల్ నందా
 5 = 1966 ఇందిరా గాంధీ
 6 = 1977 మొరార్జీ దేశాయ్
 7 = 1979 చరణ్ సింగ్
 8 = 1980 ఇందిరా గాంధీ
 9 = 1984 రాజీవ్ గాంధీ
 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్
 11 = 1990 చంద్రశేఖర్
 12 = 1991 పివి నరసింహారావు
 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి
 14 = 1996 ఎ. డి. దేవేగౌడ
 15 = 1997 ఐకె గుజ్రాల్
 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి
 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్
 * 18 = 2014 నుండి నరేంద్ర మోడీ *

 764 సంవత్సరాల తరువాత, ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.  ఇది హిందువుల దేశం.  ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ, హిందువులు తమ దేశ బానిసలుగా మారుతున్నారు, నేడు ప్రజలు చెబుతున్నారు.  హిందువులు మతతత్వమయ్యారు ,,,,,,,

 🚩🚩🚩🚩🚩
 ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి.
 హరి ॐ

మనం 1000సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మనుగడలో ఉన్నది

మహాభారత యుద్ధం ఎలా జరిగింది?

మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయో గించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...

హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిద్ధంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.
క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.

మహాభారత యుద్ధ కాలం

దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.
దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. కోల వేంకట చలపతి రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?
దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?

భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.
అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం గాండీవం (లాంచర్‌) అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.
ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నా రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.

రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. .
జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలొఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .
ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!

అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.

మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.
ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.
ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.
క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

అస్త్రాల వివరాలు

మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.
మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.

            ( ఫేస్ బుక్ నుండి కాపీ చెయ్య బడినది)