Monday, January 28, 2019

జై హింద్ !

*నేటి కవిత*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
తేది :   26- 1-2019 
వారణాసి భానుమూర్తి రావు
అంశం : గణ తంత్ర రాజ్యం

శీర్షిక : జై హింద్ !
--------------------------------------------

వందే మాతరం అని ఎలుగెత్తి చాటాలి
జైహింద్ జైహింద్‌ జైహింద్ అని‌  పిడికిలి బిగించి గర్జించాలి
వ్యయ ప్రయాసలు..ఆత్మ బలి దానాలు
గుండెల్లో గునపాలు... మంటల్లో మాడిన అనాధ శవాలు
తెల్ల వారి దుర్మార్గాలకు బలి అయిన స్వరాజ్య యోధులు
అమ్మా ...భారతమ్మ.... నీ బిడ్డల వూపిరికి
ఉరి త్రాళ్ళు బిగించిన బ్రిటీషు ప్రభుత్వం
గుర్రపు డెక్కల క్రింద నలిగిన దిక్కు లేని భారతం
బూట్లను నాకించిన తెల్ల వాడి అహంకారం
జలియన్ వాలా భాగ్ లో బుల్లెట్ల వర్షాలు
బాపూజీ అహింసా వాదం తెచ్చింది స్వతంత్ర్యం
అయినా తప్పలేదు  రక్త పాతం
మతాల చిచ్చులో బలి అయిన జన పాతం
రెండుగా విరిగి ముక్కలయిన అఖండ భారతం
అర్థరాత్రి  ఎగిరింది జాతి మువ్వన్నెల జెండా
గణతంత్ర రాజ్యమై ప్రజా రాజ్యమయింది
డెబ్బై  వసంతాలు నిండి
ప్రపంచ పటంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమయింది.! 

-------------------------------------------------------------------------
వారణాసి భానుమూర్తి రావు

No comments:

Post a Comment