Friday, September 14, 2018

ఎవరు తిరిగి తెస్తారు మా ప్రాణాల్ని?

గుండెలు పిండిన నొప్పిని
ముక్కలయిన శరీరం పడిన భాధను
చిద్రమయిన బ్రతుకును
తునాతునకలయున  జీవితాల్ని
కొండగట్టు లోయలో
సమాధి అయిన ఆశల్ని
బ్రతుకుల్ని బుగ్గి చేసిన ఆ క్షణాల్ని
మరచిపోలేక
నా కవిత్వాన్ని కన్నీటితో రాస్తున్నా
 అక్షరాల కోసం వేదనా సంద్రంలో వెతుకుతున్నా
ఆ ఘటన తర్వాత
మేలుకొన్నదా ప్రభుత్వం?
పోయిన ప్రాణాల్ని ఎవరయినా
తిరిగి ఇస్తారా?
చర్విత చరణం గాదని ఏ దేవుడయినా
ఇస్తాడా వాగ్ధానం?
తిరిగి రాని లోకాలకు వెళ్ళిన
జీవాత్మలు పరబ్రహ్మలో అవుతాయా
మమైక్యం?

12.09.2018
వారణాసి భాను మూర్తి
( కొండ గట్టు బస్సు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనల్ని చదివి ఆవేదనతో రాసిన కవిత)

No comments:

Post a Comment