Saturday, May 7, 2016

కవితాంతరంగం

కవితాంతరంగం




కవితాంత  రంగం  అనే శీర్షికలో - కవి సంగమం  అనే పేస్ బుక్  గ్రూప్ లో , నా  'సాగర మథనం ' అన్న  కవితా సంపుటి  గురించి  06. 05. 2016  నాడు  వచ్చిన  విశ్లేషణ గురించి  నా  మాటలు కొన్ని .

ఒక కవిగా  నా జీవితం ధన్య మయిందనే భావిస్తాను , కవితాంత  రంగంలో  మీ విశ్లేషణ  చదివాక . ఒక కవి అంతరంగాన్ని , అతని కవితల ద్వారా  అవిష్కరించడం , ఆతను  రాసిన  కవితల్ని క్షుణ్ణంగా  పరిశీలించి ఒక సమగ్ర మైన  నివేదికను  రాయడం అనేది  అసమాన్యమైన  క్రియ గా నేను అనుకొంటున్నాను . రాజా రామ్  తూముచర్ల  గారి కలం నుండి జారి పడుతున్న ఆణి  ముత్యాల్ల్లాంటి  కవితాంతరంగమ్ శీర్షికలో  నా పేరు చోటు  చేసు కోవడం  నిజంగా నేను ఏ జన్మలో  చేసు కొన్న అదృష్టమో ! అవును ... కవుల గురించి , వారి కవితల గురించి , వారి  ప్రతిభ  గురించి   కవి సంగమం  లో చేరిన  తర్వాతనే  నాకు తెలిసింది . ఇక్కడ  ఏంతో  మంది  ప్రతిభా వంతులు , కవిత్వాన్నే  ఉపిరిగా  చేసుకొని  బ్రతుకు తున్న మహాను భావుల  కవితల  గురించి  చదవడం, ముఖ  పరిచయం  లేక పోయినా  , ముఖ పుస్తకం ద్వారా  పరిచయం గావడం  నా అదృష్టం  గా భావిస్తున్నాను . అత్యంత  ప్రతిభాశాలి  , కవి సంగమం  అనే చెట్టు మీద  వాలుతున్న  పిట్టల్ని  ఒక్క చోట  చేర్చిన ఘనత  శ్రీ యాకుబ్  గారిది , అతనితో  పాటు పని చేస్తున్న వాహెద్  మరియు  సతీష్ లాంటి  యువ  కవులది గూడా . ఈ  సందర్భంగా  వారందరికీ  పేరు పేరునా  కృతజ్ఞతలు  తెలుపు కొంటున్నాను . 2000 సంవత్సరంలో , నేను  హైదరాబాద్ మహానగర మంచి నీటి సరఫరా లో  సి జి  ఎం ( ఫైనాన్సు ) గా పని చేస్తున్నపుడు  Dr  గోపి , తెలుగు  విశ్వ విద్యాలయం  వైస్  ఛాన్సలర్ గారి ఆశీస్సులతో ,నా  మొదటి పుస్తకం ' సాగర మథనం ' కవితా సంపుటిని రిలీజ్  చెసాను. తరువాత  2005 లో ' సముద్ర ఘోష ' అనే పుస్తకాన్ని  Dr రాము , రసమయి  మరియు Dr సినారే గారి చేతుల మీదుగా రిలీజ్ చేసాను . ఈ పుస్తకం  Dr అక్కినేని నాగేశ్వర  రావు  గారికి అంకితం ఇవ్వడం  జరిగింది .  అదే  విధంగా , ముఖ పుస్తకం  లో వస్తున్న   కవి సంగంమం  మరియు మిగిలిన గ్రూప్  లలో  125 కవితల్ని ఇంత  వరకు రాయడం  జరిగింది . శ్రీ   రాజా రామ్  గారు  నా కవితల  పట్ల  వెలిబుచ్చిన అబిప్రాయాలని సహృదయంతో  ఆదరిస్తున్నాను.  మున్ముందు మరింత  గాఢమైన , సాంద్రత కలిగిన  కవితల్ని రాయడానికి  ప్రయత్నిస్తాను . ఈ  కవితాంత రంగం  లో నాకు  చోటు  కల్పించి నందుకు  రాజా రామ్  తూముచర్ల గారికి , కవి సంగమం  నిర్వాహకులకు మరియు నా తోటి  కవి సోదరులకు  అందరికి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను - వారణాసి భానుమూర్తి రావు 

No comments:

Post a Comment