Wednesday, July 17, 2013

బడి బువ్వ



బడి బువ్వ
మింగెసింది
బడి భోజనం
విషమయ్యింది
అన్నెం పున్నెం ఎరుగని
చిన్నారుల పాలిట పాషాణ మయ్యింది
చదువు చెప్పే బడులా
లేక పిల్లల పాలిట నరక కూపాలా ?
ఉపాధ్యాయులే యమ కింకరులా ?
అన్నం కోసం
ఆకలి కోసం
బీదా బిక్కీ
చదువు కోసం
మంచి భవిత కోసం
పిల్లల్ని పంపిస్తే
భావి భారత పౌరుల్ని చెయ్యాల్సిన బడులు
శవాల్ని చేసి పంపిస్తారా ?
అవినీతి రాక్షసుల
ఆగడాలకు పరాకాష్టా ఇది ?

(బీహార్ లో నిన్న(  16-07-2013 )చాప్రా  అనే ఊరి స్కూల్లో 20 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని
ప్రాణాలు పోగొట్టుకొన్న సంద ర్భంగా స్పందించి రాసిన కవిత )
 

No comments:

Post a Comment