Sunday, May 15, 2016

కొనకంచి గారి తో కొన్ని క్షణాలు

కొనకంచి  గారి తో  కొన్ని  క్షణాలు
----------------------------

''గుడ్  మార్నింగ్  సర్ ''

ప్రొద్దున్నే  మా ఇంటి దగ్గరే ఉన్న పార్కులో  వాకింగ్  చేస్తున్నపుడు , ఒక  సన్నని  స్వరం  పలకరించింది . ఆశ్చర్యంగా  ఆ వ్యక్తీ వైపు చూశాను  . మృదువైన  కంఠం , కళ్ళల్లో  ప్రస్పుట మవుతున్న వెలుగు , సాదా సీదా  గా  కన బడుతున్న విగ్రహం , తెల్లని  గుబురు గడ్డం   , సంస్కారం  ఉట్టిపడుతున్న  ఆయన  బాడీ లాంగ్వేజ్  కన బడు తున్నాయి . నాకు అతనిలో  ఒక రవీంద్ర  నాథ్  టాగోర్  ని  చూసి నట్లుంది

''మీరు ... మీరు... ''

ఒకే ఒక్కసారి  కలిసి నట్లు గుర్తు .  కవి సంగమం లో కలిసి నట్లు  లీలగా  జ్ఞప్తికి  వచ్చింది .

''నేను  కొనకంచి ని అండీ ''

నా ఆనందానికి అవధులు లేవు .

''గ్లాడ్  టు  మీట్  యు  సర్ . నేను  భాను మూర్తి  ని ''

పరిచయాలు  అయ్యాక , అయన  తన కవితా  ప్రస్థానం  వైపుకు వెళ్ళింది  చర్చ . ఆయనకు  ఉన్న   జ్ఞానానికి , కవిత్వం పట్ల  ఉన్న  ఆయనకు  ఉన్న మక్కువ , ధ్యాస,  commitment , dedication  అన్ని  నాకు  కొన్ని  క్షణాల్లో   నే  అర్థం  అయ్యింది .

''నేనేమీ   మాట్లాడను ''అంటూనే  అనంత మైన  ఎన్నో తెలియని విషయాలను  అతని మాటల్లో  తెలుస్తుంది  మనకు. అయనకు  ఒక  సబ్జెక్టు మీద  వున్న నిర్దిష్ట మయిన , కచ్చిత మైన అబిప్రాయం  , ముక్కు సూటిగా  పొయ్యే  మనస్తత్వం  ఉండడం  వల్ల నిజంగా అతన్ని ఒక  విశిష్ట మైన వ్యక్తీ  గా నిలబెడతాయి .

' రెక్కల పులి '  తన  కవితా ప్రస్థానం లో  ఒక  మైలు  రాయి  వంటిది  అని ఆయన  అన్నపుడు  నాకు వొళ్ళు పులకరించింది . ఎందు కంటే  ఒకే  సబ్జెక్టు మీద  దీర్ఘ కవిత  రాయడం  నిజంగా  గొప్ప విషయం  .

''మీ ' మంత్ర లిపి ' పుస్తకం చాలా  బాగుందండి .పాఠకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది '' అన్నాను నేను .

ఆ మరుసటి రోజు  తన పుస్తకాన్ని నాకు ప్రెసెంట్ చేసారు కొనకంచి గారు. నేను నా ' సముద్ర ఘోష ' ,' సాగర మథనం ' తనకు ఇచ్చాను .

గానీ  నేనా పుస్తకాన్ని ఇది వరకే  బుక్ ఎక్సిబిషన్లో కొన్నాను . చదవడం గూడా  జరిగింది .

మన రెండు తెలుగు  రాష్ట్రాల్లో  ను  ' కొన కంచి గారి కవిత్వానికి  హారతులు పట్టే  పాఠకులు  కో కొల్లలు ఉన్నారు .

కొన  కంచి గారికవిత్వాన్ని  అర్థం చేసుకోవడం చాలా కష్టం . పది వాక్యాల్లో  కవితల్ని ముగించేసి  కవిత్వాన్ని చేసే వాళ్లకు విభిన్నంగా  కొన కంచి గారి   కవిత్వం  ఒక ప్రవాహం లా  ముందుకు  వురికి పోతూనే  ఉంటుంది . ఒక్కొక్క సారి  ఉప్పెన  వచ్చిన  కెరటాల్లాగా , ఇంకొక సారి జల పాతం  లోకి ఉరుకు తున్నట్లుగా  పాఠకుల్ని   ఉరుకులు , పరుగులు  పెట్టిస్తుంది .

కొనకంచి గారి  కవిత్వాన్ని  గురించి  చెప్పడం  నాకు ఒక సాహసమే  అని చెప్పవచ్చు.   వారు నిత్య  అగ్నిహోత్రుడు లాగా , నిత్య కవితా సాగర  మథనాన్ని  చేస్తూ , నూతన  కవితా అగ్ని పూలను  పూయిస్తారు తన కలం చేత . మనసు భావాలన్నీ , ఒక్క సారిగా  అక్షరాల  విస్ఫోటనాలై   మన ముందు  ప్రజ్వరిల్లి మనల్ని , ఈ  సమాజాన్ని  ప్రశ్నిస్తాయి .

 ' గ్రహణం ' పట్టిన  ఈ  సమాజం కోసం  , ' అశ్రువు ' ఒక్కటి ధార పోసి , ' పూర్ణిమ ' ని చిగురింప  చేసారు  కొనకంచి గారు . 'చూపులు  వాలిన  చోట ' 'మంత్రలిపి 'ని కవిత్వం  చేశారు .

Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility. - William Wordsworth .

కోన కంచి గారి కవిత్వం  powerful  feelings  వల్ల  ఉబికి వచ్చిన  spontaneous  over flow  అని  నిక్కచ్చితంగా చెప్పవచ్చు .

 త్వరలో  విడుదల  అవుతున్న ' నేనేమీ  మాట్లాడను ' సందర్భంగా , కవి గారికి శుభా  కాంక్షలు  తెలుపు తున్నాను .

భానుమూర్తి / 15.05.2016

No comments:

Post a Comment