Saturday, October 10, 2015

ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


ఏది కవిత్వం? ఏది కుకవిత్వం? ఏది సుకవిత్వం ?


కవిత్వం అంటే ఏమిటి? కోన్ని మంచి మాటలు చెప్పడం , సమాజాన్ని జాగృతి  చెయ్యడం , అన్యాయాన్ని వేలెత్తి చూపడం , ప్రజల మనో భావాల్ని   దెబ్బ తినకుండా వ్రాయడం .

ఈ ఆమధ్య వ్రాస్తున్న కవులు తెగ ఆవేశ  పడి  పోయి  ఏది  వ్రాయచ్చో , ఏది వ్రాయ  గూడదో  అని తెలియకుండా  , నోటి కి ఏది వస్తే అది వ్రాయడం , వచన కవిత్వం గదా అని ప్రతి ఒకడు ఏదో  ఒకటి వ్రాయడం అలవాటై పొయింది . ముఖ పుస్తకం , blogs వచ్చిన తర్వాత  ఈ  జబ్బు చాలా  ముదిరి పోయింది  . ఎందుకంటే  ముఖ పుస్తకంలో  సంపాదకులు  గానీ , కవితను సరి  చూసి  పబ్లిష్  చెయ్యడానికి  ఎవరు ఉండరు . ఇక్కడ  కవి రాసింది  రాసినట్లు గానే  post  చెయ్యబడుతుంది .  గాంధీ  చంపినా వాడు గాడ్సే . గాంధీ  మంచి  వాడు , మహత్ముడు . మరి గాడ్సే గూడా   మంచి వాడే మరి కొందరికి  . ఒక వర్గం  కవులు గాంధీ  ని గురించి రాస్తే , ఇంకొక వర్గం కవులు గాడ్సే గూడా గొప్ప వాడని రాస్తారు. అంటే ఒకే  విషయం మీద , రెండు విభిన్న  వైరుధ్యాలు  గన  బడుతాయి. అమ్మ మంచిదా , నాన్న మంచోడా అని అడిగితే   , ఇద్దరు మంచోళ్ళే  అన్న బిడ్డ లా కవి  తన అశావహ దృక్పథాన్ని , విషయ పరిజ్ఞానాన్ని  ,  ఒక  positive belief  ని balanced  approach  తో అలవరచు కొవాలి.  కవి  తాను  వ్రాస్తున్న  విషయం  మీద  సమన్వయ  న్యాయం  చెయ్యగలగాలి.

కులాల  గురించి పరస్పర దూషణలు చేసుకోవడం, ఇతర మతాల్ని కించ పరచడం,   ఒకరి ఆహారపు అలవాట్లను  , వేష భాషల్ని, వారి సంప్రదాయాల్ని  అగౌరవ పరచడం లాంటి విషయాల మీద కవులు  రాయక పోవడం మంచిది. చైనా లో కుక్కల్ని , జపాన్ లో కప్పల్ని తింటారు. కొందరు ఎలుకల్ని , బొద్దింక ల్ని గూడా కొందరు  తింటారు . అవి మన లాంటి దేశాల్లో  తినరు. అలా అని వాళ్ళని అసహ్యించు కొంటమా ?

 కవి  ఏ విషయాన్ని అయినా బాహ్య దృష్టి , అంతర్గత దృష్టి తో చూడ గలిగినప్పుడే   రాణిస్తాడు .  తన చెప్ప  దలచు కొన్న దేదో  నిర్మోహ మాటం గా రాయ గలిగిన వాడే  మంచి  కవి. కొన్ని  సమాజ సహజ  సూత్రాలను బట్టి కవి  మసలు కొవాలి. సమాజం కంటే కవి గొప్ప వాడు గాదు.  తండ్రి కూతురు మధ్య , అన్న చెల్లెళ్ళ మధ్య  అనురాగం ఉంటుంది గానీ , sexual  perceptions ఉండవు . ఆ మధ్య ఒక కవి  ,' నాన్న నా యోనిలో ...'  అని ఒక కవితను రాసి  మళ్లీ  డిలీట్  చేశారు . అంటే ఆత ను చెప్ప దలచు కొన్నది  child sexual molest  మీద. గానీ రాస్తున్నది బూతు  కవిత్వం .

చెప్పదలచు కొన్నది ఒకటి  , రాస్తున్నది  వేరొకటి  అయితే ఆ కవిత్వానికి  విలువ ఏముంటుంది ? పద ప్రయోగాలు చెయ్యాలనే  ఆరాటం ,  తనకు  తప్ప వేరే వాళ్లకు అర్థం గాకుండా వ్రాయడం ఈ  మధ్య fashion  అయిపొయింది .
చిన్న చిన్న పదాలతో , పామరులకు గూడా  అర్థమయ్యే రీతిలో కవులు వ్రాయ లేరా ?

'' దేశ  మంటే  మట్టి  గాదోయ్ ! దేశ  మంటే  మనుషులోయ్ !!'' అన్న గురుజాడ  కవితలో గొప్ప పద ప్రయోగం ఏమి లేదు కదా ?

(డిస్క్లైమర్; ఇది ఎవరిని ఉద్దేశించి రాసినది  గాదు .ఇది  కేవలం నా  వ్యక్తిగత అభిప్రాయం  మాత్రమే )

No comments:

Post a Comment