Tuesday, January 6, 2015

మిత్రమా !


మిత్రమా !

 

మిత్రమా !
చాలు నీవిక రాసినది
పుంఖాను పుంఖాను లుగా
కవితల కీకారణ్యంలో పెరిగిన
అక్షరాల మహా వృక్షాలు
అలుపెరగని అభిమన్యుడిలా
సమరానికి దిగిన నీ భావాస్త్రాలు
కాని మిత్రమా నువ్వెప్పుడైనా
దరిద్ర దిగంబరుల , దగా బడ్డ దీనార్థుల కథల్ని విన్నావా ?
ఆడ పుట్టుకే శాపంగా
దిన మొక గండంగా బ్రతికే నిర్భయ , అభయల్ని
అక్కున దరి జేర్చు కొన్నావా ?
గురువులే కామాంధులై , కాల యముడ్లై
చిన్నారుల పసిడి బాల్యాన్ని బడి గదుల్లోనే సమాధి చేస్తే
పసి హృదయాల్ని ఒక్కసారైనా అక్కున చేర్చు కోన్నావా ?
మిత్రమా !
నీ కవితలు ఎంత మంది ఎదల్ని తట్టి లేపుతున్నాయి ?
నీ కవితలు ఎంత మందికి ఉత్ప్రేరకాలుగా పని జేస్తున్నాయి?
బాల్య మంతా దరిద్రానికి బలి అయి పోతే
బాల్య మంతా బానిసత్వానికి బలి అయి పొతే
బాల్యం లోనే బ్రతుకు భారమయితే
నీ కవితలు వాళ్ళ జీవితాల్ని బాగు పరచాయా ?
నిన్న లేదు
నిన్న రాసిన సిరా ఇంకి పోయింది
రేపటి గురించి రాసే కవితల కోసం
కొత్త సిరా నింపుకోవాలి --
రేపటి గురించి రాసే కవితల్లో
నేడే మనం పయనిద్దాం.....
గుడిసె లోకి , బడి లోకి , గుడి లోకి
అడవి లోకి , లోయల్లోకి , జల పాతాల్లోకి
ఆకాశం లోకి , భూమి లోకి , పాతాళానికి
గనుల్లోకి, మట్టి పొరల్లోకి
సూర్యుడు లోకి, చంద్రుడు లోకి
నరకం లోకి , స్వర్గం లోకి
కలసి రాస్తాం కవిగా గాకుండా !
కవితల్ని విన్పించడం మానేసి
పోరాడుదాం జన హృ దయం తోనే !
ఒక బాల్యాన్ని ఒక్కొక్కరు దత్తత తీసుకొంటే
ఒక చిన్నారికి ఒక బంగారు బాట చూపిస్తే
ఒక నవ ప్రపంచానికి నడక నేర్పిస్తే
కవి కవి గానే మిగలడు
ఆతను ఒక అస్తమించని రవి లాగ
అహర్నిశలు శ్రమించే కవి కార్మికుడు లా
చరిత్రలో మిగిలి పోతాడు శాశ్వి తంగా !

రచన ; వారణాసి భాను మూర్తి రావు
09.12. 2014

ఒక్క కవిగా నన్ను నేను ప్రశ్నిం చు కొన్నాక కవిత ఇలా వ్రాశాను .

 

No comments:

Post a Comment