Sunday, December 7, 2014

kavyam - కావ్యం


నేను భౌతికంగా ఈ ప్రపంచంలో లేక పోయినా
నా రచన లన్నీ శాశ్వితంగా ఉంటాయి
ఒక పాఠకుడు నా గ్రంధాన్ని బీ రువాలో దాచుకొన్నా
ఒక పాఠకుడు గుండెల్లో భద్రంగా దాచుకొంటాడు
ఒక భావం ఉద్రేకాన్ని కలిగించినా
ఇంకొక భావం మస్తిష్కం లో ఉండి పొతుంది శాశ్వితంగా
కవి వ్రాసిన కావ్యం
అందరికీ ఇష్టమవుతుందని నేను అనుకోను
వంద మందిలో ఒక్కడయినా చదివి
జీవితాన్ని మార్సుకోన్నా అది కవి చేసుకొన్న అదృష్టం
కావ్యానికి కళ్ళు లేవు
అది నడచు కొంటు వెళ్ళదు
కావ్యానికి నోరు లేదు
అది మాట్లాడదు
కానీ కావ్యానికి అక్షరాల భాష ఉంది
అది పాఠ కుడి హృదయాన్ని తాకుతుంది
అరలలో అమ్ముడు పోకుండా పేరుకుపోయి వుండొచ్చు ఆ కావ్యం
గానీ పుస్తకం తెరచి పుటల హృదయాలను చదివితే
ఈ జన్మకి చాలినంత సంతృప్తి దొరకవచ్చు
కవి రాసిన కావ్యం
కొందరి జీవితాలలో అమృత వర్షం కురిపించ వచ్చు
కవి రాసిన గేయం
కొందరిని మానవతా మూర్తులుగా మార్చవచ్చు !



నా ‘సాగర మథనం ‘కవితా సంపుటి ఆవిష్కరణ మహోత్సవ సందర్భంగా రాసిన కవిత
10.4.2000


No comments:

Post a Comment