Sunday, November 30, 2014

రాస పల్లి కథలు ( 1) - ఎద్ద ల బండి

రాస  పల్లి   కథలు ( 1)    - ఎద్ద ల  బండి 




నేను ఎనిమిదో  తరగతి సదివే టప్పుడు  అనుకొంటా ,  మా అత్తోల్లింటికి  పోవాలనుకొన్న. పతి సమ్మత్సరము నేను పోతాను  . మా ఉరికి పది   మైళ్ళు ఉంటుంది ఆ ఊరు. మాకు పొద్దున్నే పది  గంటలకు ఒక బస్సు ఉండాది. ఆ బస్సు పేరు సలామత్  బస్సు. మదనపల్లి కాడికి  పోయి , మళ్ళా రాత్రి  ఆరు  గంట లకు మా ఉరొస్తె , ఎనిమిది గంట కొట్టే సరికి మా అత్తోల్ల ఊరు సెరుతున్ది. మెల్లగా ఎద్దల బండి మాదిరి పోతుంది ఆ బస్సు.

నా గహ చారమో ఏమో గాని , ఆ రోజు తోమ్మోదయినా బస్సు రాలా. మా నాయనకు కోపోమోస్తా ఉండాది.

'ఎంతసేపు ఆ రాస పల్లి క్రాస్ రోడ్డులో కుసొవాలి. రేపు ఎల్ల బారదు వు లే రా నాయనా!'  అన్నాడు మా నాయన.

నాకేమో ఒకటే బయ్యం . అప్పడే సంకురాతరి  సెలవులు మూడు రోజులు అయి పోయి నాయి. మా అత్తోల్లింటికి పోతే మా బావ , మా మరదలు , మా బావ మరుదులు తో బాగా ఆడు కొవచ్చు. వాళ్ళు బాగా భూములున్నొళ్ళు , మంచి సే ద్యగాళ్ళూను. నాకు అక్కడికి పొతే చేన్లు , మడ్లు , సెరుకు తోటలు చూడచ్చు . పచ్చి సేనిక్కాయలు తెమ్పుకొని , అక్కడే సెత్త , సేదారం , ముళ్ళ కంపలు ఏసీ , పచ్చి సేనిక్కాయలు కాల్చో కొని తింటా ము.

మా నాయనకు  కోపం బాగా వస్తా ఉండాది .
'ఆ తిక్క నాయాలు బస్సు ఎక్కడో చచ్చిన్ది. ఆ గలీజు నా కొడుకులు రిపేర్ ఇప్పుడే చెయ్యర్ర . నువ్వు ఈ రోజు బయలు దేరిన ఏ లా ఇసేశం గూడా బాగా లెదు. అ   మంగలోళ్ళ పిల్లి  అడ్డం వచ్చి  నప్పుడే అనుకొన్యాను. నువ్వు పయా నం మాను కొంటె మంచిదని .'
 మా నాయన కు కోప మోస్తే , మనిషే గాడు . చేతిలో ఏది  కాన బడితే , దాంతో కొడతాడు.
ఒక్క సారి , నేను అల్లరి బాగా చేస్తే , చింత బరికె తో గొడ్డు ను కొట్టినట్లు కొట్టాడు. ఇంకో సారి,  ఎద్దులని తోలే సెల్ల కోడి తో కొట్టినాడు .
సరే నని ' అట్లాగే నాయనా. అయితే రేపు మల్లి బోతా .. నన్ను నువ్వే బస్సు ఎక్కించాల ' అన్నాను నెను.
మా నాయన తో బాటు తిరుక్కోని , మా రాచ పల్లి లో అడుగు బెట్టె సరికి ఆ బస్సు సర్రున బొయిన్ది. నాకు చానా కొపమొచింన్ది. కొంసేపు ఉండ్యుం టే , మా ఆత్తొళ్ల ఇంట్లో హాయిగా పడుకొని కతలు సేప్పుకొనే వాల్లమ్. మా అత్తోల్లు గుడా సెప్పిన రోజు కి రాలేదని , ఈ రాత్రంతా నిద్రపోరు .

సరే నని మరుసటి రోజు మా నాయన పిలేటి కి వచ్చి , పిలేటి బస్టాండ్ లో ఇంకో బస్సు ఎక్కించి , నా పక్కనున్న ఆసామి కి సెప్పి , మా పిల్లోడ్ని పలానా వాళ్ళ ఇంట్లో వదులు తావా సామీ అని అడుక్కొన్నాదు. పాపం ఆయన సాన మంచోడు గా ఉన్నట్లుంది . మా నాయన నాకు సేనిక్కయాల పొట్లం , కమ్మర కట్లు రెండు, సుట్టలు కొనిచ్చి నాడు .
' జా గరత్త నాయన . పోతానే అత్తకు సెప్పు , నాకు నువ్వు సెరి నట్లు జాబు రాయమని. లేదంటే ఎవరయినా మన్నూ రో ళ్ళు వస్తా వుంటే సెప్పిమ్చంను . '

పది గంట లకు అత్తోల్ల ఊ రికి సెరినా . అత్తా , మామ , మా బావ , నా మరదలు అందరు శానా కుసాలు పడి  పోయి నారు. అం దారితో  కూసోని , అన్నం తిన్యాను . మా అత్తా వాళ్ళు నా కోసం సద్ద సంగటి , రాగి సంగటి , మజ్జిగ పులుసు , పచ్చి పులుసు సేసినారు . నాకు ఎరాబద్దకు , పచ్చి  సేనిక్కాయల పుల్లకూర  ఇష్ట మని రేపు చేస్తానాని  సెప్పింది మా అత్త .

నాకు శానా కుసాలుగా ఉన్ది. మా అత్త  ఆ రోజు ఎక్కడికో బోవల్ల అని అన్ది. ఆళ్ళ జీతగాడ్ని పిలిసి, ఎద్దల బండ్లి ని కట్టమన్ది .

'ఒరేయ్ రాజు , నువ్వు బావోల్లతో ఆడుకొంటూ ఉండు , నేను పక్క పల్లె కొమిటోడ్ల అంగడికి బొయ్యెస్తా '
నాకు బండి తోలల్ల అంటే శా నా ఇష్టం . మా అత్తతో మురిపెంగా అడుక్కొన్నా  . ' అత్తా అత్తా నేనొస్తా 'అన్నా . అత్త ' సరే ' అన్ది.

సరే నని రెండు గంటలకు ఎద్దల బండి రడి చేసినాడు ఆళ్ళ జీతగాడు . నేను , మా అత్తా బండ్ళో కూసోని పోతా  ఉండాము .
ట్టర్ర్ ..... ట్టర్ర్ .... పద ...పదా ... అని సాన ఉషారుగా ఆడు బండి తొలత ఉండాడు ..

బండి ఊరు  దాటి , ఒక్క మెయిలు దూరం పొయింది . తెల్ల ఎడ్లు సాన బాగా  పర్గేత్తతా ఉండాయి . నా కేమో బండి తోలల్ల అని బలే కోరిక గా ఉన్డాది . అత్త ఏమంటు దో అని నాకు బయ్యం . దైర్న్యం సేసి అత్తను అడిగినాను .

' నీ  కలవాటు లేదురా నాయనా . ఆ గిత్తలు నీ మాట ఇనవు. ' అంది మా అత్త.
నేను మా అత్త మాట ఇనలా. ఏడుస్తా ఉండా ను .

'పోనిలేమ్మ , పిల్లోడు అడగతా ఉండాడు . నేను పక్కన కుస్సోని బండి తోలిపిస్తా!' అన్నాడు జీతగాడు .
మా అత్త బయ్యం గానే , ' సరే నాయన , జాగ్రత్తగా నడుపు ' అనిన్ది.

నాకు బలే కుసాలు అయ్యిన్ది. వెంటనే ఆయన దగ్గర నుండి ముక్కు తాడ్లు పట్టుకొని, ఒక చేత్తో చల్ల కోడి తో ' డ రర్ ... డ రర్ ... అంటూ నాలిక తో వింత సబ్ధం సేసుకొంటా బండి నడు పుతుండా ను .

కొంచెం దూరం పోయిన్నాక , ఏమయిందో ఏమో, బండి సేక్రం ఒక పెద్ద రాయి మీద ఎక్కి , ఒక పక్కకి వంగి పడి  పొయింది . కాడిమాను మెడ మీద ఒక ఎద్దు మొయ్య లేక కింద పడి పొయిన్ది. నేను,  మా అత్తా ఇసిత్రిం గా ఇసిరేసినట్లు ఒక పక్కకు పడి పొయినాము. దెబ్బలు ఏమి తగల్లేదు గాని సెర్మము సీక్కొని పొయిన్ది. మా అత్త ఒక్కటే ఏడ్పు . సెపితే ఇన్నావా ? అదృస్టం  బాగుండి , బతికి బట్ట గట్టినాము గాని, లేకుంటే సచ్చి పొయ్యే వాళ్ళం గదరా ?' అనింది మా యత్త  ఏడుస్తా .

పాపం మా జీ త గాడు ,ఎద్దల్ని లేపి , వాటిని దువ్వి ,' లేదురా రాముడు , ఏమి కాలేదు' , అని కాడి మాను గట్టిగా బిగించి నన్ను ఎనక్కు కూర్చో మని  బండి తోలినాడు . ఇంక మా యత్త , ఈ రోజు సేకునం బాగా లేదు , ఇంటికి మళ్ళించు అనింది .

మరుసటి రోజు ఏమయిందో ఏమో గానీ ,ఆళ్ళ జీత గాడ్ని  తోడిచ్చి , బస్సు ఎక్కింఛి , మా ఊరు పంపించేసింది మా యత్త.

రచన: వారణాసి భాను మూర్తి రావు
30. 11. 2014

ఇందు లోని పాత్ర దారులు కేవలం కల్పితాలే , ఎవ్వరిని ఉద్దేశించి రాసినది గాదు. ఈ కథ నిజంగా నా నిజ జీవితం లో జరిగినది . ఈ కథ ఇటివలే పరమ పదించిన మా మేనత్త గారికి అంకితం .

No comments:

Post a Comment